కరోనా నివారణతోనే వృద్ధి: ఆనంద్‌ మహీంద్రా

Corona Will Effect Self Employed People Says Anand Mahindra - Sakshi

ముంబై: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అధిగమించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తి వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారు, దినసరి కూలీలపై తీవ్ర ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే రెండో ప్రపంచ యుద్దం తరువాత అమెరికా అమలు చేసిన మార్షల్‌ ప్రణాళిక లాంటి వాటిపై ఆలోచించాలని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక దేశ ప్రణాళిక అమలు చేయడం సాధ్యం కాదని..  ప్రతి దేశం వైరస్‌ను నివారించేందుకు సొంత ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ పై ప్రతి దేశం యుద్ధం ప్రకటించి ప్రజలను కాపాడాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని నివారించగలిగితే అంతర్జాతీయ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

చదవండి: బర్గర్లకు బదులు సమోసాలు పెట్టండి : ఆనంద్‌ మహీంద్రా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top