కనిపించకుండా పోయిన బాలుడు శవమై తేలాడు

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని వీరవాసరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన కొణితివాడకు చెందిన ఏడేళ్ల బాలుడు శవమై కనిపించాడు. వివరాలు.. నిన్న సాయంత్రం నుంచి మోక్ష గౌతమ్(7) కనిపించకుండాపోయాడు. ఊరులోని చెరువులో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున బాలుని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి