కరోనా: ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు

Police Case Filed On Vanastalipuram Hospital Management In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై హైదరాబాద్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వనస్థలిపురంలోని జీవన్‌ సాయి హాస్పిటల్‌ వారు 6 రోజుల పాటు వైద్యం అందించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ వ్యక్తి మలక్‌పేటకు చెందిన గ్రౌండ్‌నట్‌ షాప్‌ యాజమానిగా పోలీసులు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తితో సంబంధం ఉన్న మరో 16 మందిని పోలీసులు హోం క్వారంటైన్‌కు తరలించారు.

ఉప్పల్‌ హెరిటేజ్ ప్లాంట్‌లో కరోనా కలకలం

పోలీసుపై ఉమ్మేసి.. కరోనా ఉందని అబద్ధం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top