వ్యూహం పన్నారా?

‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట.
ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్మేన్’ తర్వాత నాని, నివేదా థామస్లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి