నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ

సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ కొట్టి పారేశారు. కమలదళంలో చేరనున్నట్లు తనపై కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ‘బీజేపీలో చేరాలంటూ నన్నెవరూ ఆహ్వానించలేదన్నది సుస్పష్టం. తిరువళ్లువర్(ప్రాచీన తమిళ కవి)పై జరిగినట్లే నాపై కూడా బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, తిరువళ్లువర్ కానీ, నేను కానీ ఆ వలలో పడబోం’అన్నారు. హిందూ మున్నానీ నేతలు తిరువళ్లువర్ విగ్రహానికి కాషాయ రంగు వస్త్రం కప్పడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు నాపై బీజేపీ మనిషినంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. కానీ, అది ఎంతమాత్రం నిజం కాదు’అని అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి