బాబు ఎంతకైనా దిగజారతాడు : విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని విమర్శించారు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. వారిపై అధికార పార్టీ సానుభూతిపరులనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుందన్నారు. వీటిని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అఖరున ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని చంద్రబాబు శోకాలు పెడతారని వ్యాఖ్యానించారు.
చదవండి : వీడియోలు తీయండి.. గొడవ చేయండి
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి