'కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు'

MLC Jeevan Reddy Says,TRS Government Has No Sanity Over Kaleshwaram project - Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

సాక్షి, కరీంనగర్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటివరకు సమర్పించకపోవడంతోనే కాళేశ్వరానికి జాతీయ హోదా దక్కలేదని మండిపడ్డారు. ఎక్కడ లొసుగులు బయటపడతాయేమోనన్న భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆఆర్‌ హోదా కోసం ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారే తప్ప కేసీఆర్‌ పెద్దగా చేసిందేమి లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top