హిందువులు పేరుతో టీడీపీ నీచ రాజకీయం Test

Minister Kodali Nani Fires On Chandrababu - Sakshi

మంత్రి కొడాలి నాని

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బూట్లు వేసుకుని తిరుమల కొండ ఎక్కితే.. సీఎం జగన్‌ చెప్పులు లేకుండా తిరుమల కొండ ఎక్కారని తెలిపారు. ‘‘తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా..? ఎడమ చేత్తో భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు హిందువులా?. చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నారా?’’ అంటూ మంత్రి నిలదీశారు. (చదవండి: సీఎం జగన్‌కు శ్రీవారిపై ఎంతో నమ్మకం)

తాను ఏనాడూ దేవుళ్లను కించపరచలేదని, ఆంజనేయ స్వామిపై నేను ఒకటి మాట్లాడితే.. టీడీపీ మరొకటి దుష్ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ‘‘సీఎం జగన్‌ తిరుపతికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు తిరుమల వెళ్లారు. భవిష్యత్‌లో కూడా వెళతారు. టీడీపీ, బీజేపీలు హిందువులు పేరుతో రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్‌కు అన్ని మతాలు, కులాలు ఒక్కటే. నా మెడలో అన్ని మతాల దండలు వేసుకుంటాను. నాకు అన్ని మతాల ప్రజలు ఓట్లేస్తేనే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యానని’’ కొడాలి నాని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top