టాటా ‘నెక్సాన్ ఈవీ’ లాంచ్
విద్యుత్ వాహనాలకు పెరగనున్న ఆదరణ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ తన పాపులర్మోడల్ నెక్సాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఈ వాహనాల ఉత్పత్తి విషయంలో మరో అడుగు ముందుకేసిన టాటామోటార్స్ నెక్సా ఈవీ పేరుతో మంగళవారం లాంచ్ చేసింది. టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ జిప్ట్రాన్తో దీన్ని రూపొందించింది. ఎక్స్జెడ్ ప్లస్, లగ్జరీ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ ఎం అనే మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రోజు నుండి 22 నగరాల్లోని 60 డీలర్ అవుట్లెట్లలో నెక్సాన్ ఇవి అందుబాటులో ఉంటాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ బుకింగ్ గత ఏడాది డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి