టీమిండియా కొంపముంచిన ఆ రనౌట్!
ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్లో అందరి అంచనాలను నిజం చేస్తూ ధోని తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ. రెండో బంతిని కీపర్ ఎండ్స్వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో ధోని తడబడ్డాడు. గప్టిల్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో ధోని రనౌట్ అయ్యాడు. ఇది మ్యాచ్పై ప్రభావం చూపి టీమిండియా ఓటమకి కారణమైంది. రనౌట్ కాకుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ధోని రనౌట్ టీమిండియా కొంప ముంచింది. ఓటమికి కారణమైంది. ఫైనల్కు చేరకుండా అడ్డుకుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి